ఆసియా గేమ్స్ 2026కు భారత మహిళల జట్టు ప్రకటన..
జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా గేమ్స్ 2026 కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా కొనసాగనున్నారు.
ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించినప్పటికీ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలపై సెలక్టర్లు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆసియా గేమ్స్లో కూడా వీరిద్దరి నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది.
ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులు చేయలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియాకు చోటు కల్పించకుండా, ఆమె స్థానంలో 17 ఏళ్ల యువ సంచలనం జి. కమిలినిని జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల తన ప్రదర్శనతో ఆకట్టుకున్న కమిలినికి ఇదే తొలి ఆసియా గేమ్స్ అవకాశం కావడం విశేషం.
ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్కు కూడా జట్టులో స్థానం లభించింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు ఆమె పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంటుంది.
2023లో చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి స్వర్ణాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆసియా గేమ్స్ 2026కు భారత మహిళల జట్టు:
- హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్)
* స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)
* షెఫాలీ వర్మ
* జెమీమా రోడ్రిగ్స్
* దీప్తి శర్మ
* రిచా ఘోష్
* జి. కమిలిని
* భారతి ఫుల్మాలి
* శ్రీ చరణి
* రేణుకా ఠాకూర్
* అరుంధతి రెడ్డి
* క్రాంతి గౌడ్
* నందిని శర్మ
* శ్రేయాంక పాటిల్
* రాధా యాదవ్ -

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)